
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: అక్రమంగా తరలిస్తున్న 727 కిలోల గంజాయిని కొత్తగూడెం పోలీసులు శనివారం పట్టుకున్నారు. పట్టణంలోని శేషగిరి నగర్లో వాహనతనిఖీలు చేస్తుండగా, లారీలో గంజాయి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పట్టుకున్న గంజాయి విలువ రూ.3.64 కోట్లు ఉంటుందని ఎస్పీ బి.రోహిత్ రాజు తెలిపారు. ఏపీలోని చింతూరు నుంచి ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాకు శివం గుప్తా అనే వ్యక్తి సూచనల మేరకు భురి సింగ్, రవి కుమార్ లారీలో గంజాయి తీసుకెళ్తున్నారని తెలిపారు.
లారీలో ప్రత్యేకంగా తయారు చేసిన అరలో గంజాయిని పెట్టారు. కొర్రా సీతారాములు, వంతాల విశ్వనాథ్, వంతాల బాబూరావు, చిన్నారావు, సాయిబాబు, శంకర్రావు, భద్రి వద్ద గంజాయిని కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు. భురి సింగ్, రవి కుమార్లను అరెస్ట్ చేశామని తెలిపారు. గంజాయిని పట్టుకున్న సీఐ కరుణాకర్, ఎస్సై విజయ, సీసీఎస్ ఇన్స్పెక్టర్ రమాకాంత్, ఎస్సైలు ప్రవీణ్, రామారావు, సిబ్బందిని ఎస్పీ అభినందించారు.